సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మవారి దసరా వేడుకలు ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో మహోత్సవాలు ముగింపు గా రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి శ్రీ అమ్మవారి దేవాలయ ఆవరణలో భక్తులకు విశేషంగా షడ్రుచులతో అన్నసమారాధన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. మొదటగా శ్రీ అమ్మవారికి పూజ నిర్వహించి ప్రసాద నివేదన అనంతరం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మెన్ మానేపల్లి నాగేశ్వరరావు , ఇతర సభ్యులు, దేవాలయ ఇఓ, సహాయకమిషనర్ యర్రం శెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు..
