సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలోని మారుతి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి 42వ శ్రీ హనుమద్వత వార్షికోత్సవాలు ముగింపు సందర్భముగా నేడు, మంగళవారం దేవాలయం ఆవరణలోని మారుతి టాకీస్ గ్రౌండ్ లో భక్తులు మరియు దాతల సహకారంతో శ్రీ స్వామివారి అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించే కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
