సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేటి ఆదివారం ఉదయం ఆంద్రప్రదేశ్ హై కోర్ట్ జస్టిస్, వి. గోపాలకృష్ణ రావు దంపతులు దర్శించికున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, పూజాది కార్యక్రమములు నిర్వహించారు. వీరిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ వారికీ శ్రీ అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలు, జ్ఞాపిక లు ప్రసాదలు అందచేసారు. తదుపరి, జస్టిస్, వి. గోపాల కృష్ణ రావు దంపతులు గునుపూడిలోని పంచారామ క్షేత్రం లో శ్రీ సోమేశ్వర స్వామి ని కూడా ఆలయ మర్యాదలతో దర్శించుకొన్నారు.
