సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షిక మహాత్సవముల సందర్భముగా శ్రీ అమ్మవారిని, దేవాలయాన్ని నూతన రంగులతో అలంకరించుటలో భాగంగా ది. 15.12.2022 గురువారము ఉదయం గం. 10.00 ని.లకు కళాపకర్షణ కార్యక్రమమును ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ , బ్రహ్మశ్రీ తంగిరాల దత్తత్రేయ శర్మ వార్ల ఆద్వర్యములో నిర్వహించిన తదనంతరము శ్రీ అమ్మవారి మూలవిరాట్ దర్శనము తాత్కాలికముగా నిలుపుదల చేయబడును. అయితే శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవమూర్తి దర్శనమునకు పూజలకు ప్రదిక్షణ మండపం వెనుక యదావిధిగా పూర్వము వలె భక్తులను అనుమతిస్తారు. తిరిగి ది. 29.12.2022, గురువారం ఉదయం గం. 11.00 లకు కళాన్యానము అనంతరము శ్రీ అమ్మవారి ఆలయము తెరిచి మూలవిరాట్ దర్శనమునకు భక్తులను అనుమతిస్తారు అని సదరు విషయమును ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యర్రంశెట్టి భద్రాజీ , ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకటించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *