సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో భక్తులు గత 46 రోజులుగా సమర్పించిన కానుకల ఆదాయం కోసం నేడు, సోమవారం ఈరోజు హుండీ తెరచి లెక్కించగా మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.91,95,041./ అక్షరాలా తొంబై ఒక లక్ష తొంబై ఐదు వేల నలభై ఒక రూపాయలు, మరియు బంగారం 69 గ్రాములు,వెండి 315 గ్రాములు మరియు పలు దేశముల విదేశీ కరెన్సి శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించుకున్నారు.ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, తనిఖీదారివారు వి వెంకటేశ్వరరావు, ఈఓ కర్రీ శ్రీనివాస్ దండు కృష్ణం రాజు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రీజనల్ మేనేజర్ S గురువయ్య చీఫ్ మేనేజర్ జి శ్రీనివాస్ రాజు బ్యాంకు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *