సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రావణ మాసం నేపథ్యంలో భీమవరం పట్టణంలో వాడవాడలా బంగారు తల్లి శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర మహోత్సవాలును, అన్నసమారాధన లు ప్రజలు ఘనంగా చేసుకొంటున్నారు. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ దేవాలయంలో శ్రీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం కొరకు భీమవరం కి చెందిన గుండాశి మణికంఠ సుమారు 72 వేలు రూపాయలు విలువ గల 8 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు నిర్వహించి ప్రసాదాలు అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
