సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్తానములో నేడు, మంగళవారం శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి జయంతి సదర్భముగా ఆలయ ప్రధాన అర్చకులు మల్లిఖార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం E.V.R.సోమయాజులు భక్తుల నుద్దేశించి .. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అయిన శ్రీ ఆది శంకరాచార్యులు హైందవ మతోద్ధరణకు చేసిన కృషి, గురించి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. .ఈ కార్యక్రమాలలో దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మానేపల్లి నాగేశ్వరరావు ,ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ,ముత్యాల రామారావు , Ch.నాగ శేషగిరి ,M.సుందరరావు ,T.భాగ్యలక్ష్మి ,K.వెంకటలక్ష్మీ ,G.విజయలక్ష్మి ,N.విజయ నాగలక్ష్మి ,పాల్గొన్నారని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణా ధికారి యర్రంశెట్టి భద్రజీ తెలిపారు.
