సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: రాష్ట్రంలోనే ప్రఖ్యాతి పేరుగాంచిన మహిమగల భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీమావుళ్ళమ్మ దేవాలయానికి నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం నేడు, శుక్రవారం శ్రీ అమ్మవారి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి, జనసేన చినబాబు, బీజేపీ వినోద్, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ధర్మ కర్తల మండలి చైర్మన్ గా బొండాడ నాగ భూషణం, మిగతా సభ్యులుగా రామాయణం శ్రీనివాస్, వుడిసి మణికాంత మీనాక్షి, అథికెల అంజనేయ ప్రసాద్, గుడిసి జనకి నాగ శిరీష కరెంపుడి ఆదిలక్ష్మి , అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం ,మిర్తిపాటి గుణేశ్వర రావు , మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్య రాజు ,పాపోలు యేడుకొండలు తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. మహిమానిత శ్రీఅమ్మవారి సేవకు నియామింపబడ్డ ఈ ధర్మ కర్తలు ఎంతో అదృష్టవంతులని, అభినందించారు. ఈ ఈనెల 13వ తేదీ నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, నెలరోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సభ్యులు చూసుకోవాలని, భక్తులకు అమ్మవారి దర్శనం భక్తులకు సంపూర్ణంగా అయ్యేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణవస్త్రాన్ని కూడా త్వరలోనే పూర్తి చేద్దామని, అమ్మవారికి పూర్తిగా స్వర్ణ మయం చేయడమే లక్ష్యమని అన్నారు. దేవాలయాల అభివృద్ధికి నూతన సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు భక్తులు పాల్గొన్నారు.
