సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉపాలయం అయినటువంటి శ్రీ అశ్వత్త గణపతి నవరాత్రులు పలు ఆధ్యాత్మిక కార్యాక్రమాలు తో వైభంగా ముగిస్తున్న నేపథ్యంలో నేడు, శనివారం 3500 మందికి అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమం ను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, చేతులు మీదుగా ప్రారంబించారు. వైదిక సిబ్బంది ప్రత్యేక పూజలు.ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శాసన సభ్యులకి శేషవస్త్రం ప్రసాదం అందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు..స్థానిక సుంకర పెద్దయ్య వారి వీధిలోని స్థానిక యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి శ్రీ వినాయక స్వామి ఆలయం 34వ వారికోత్సవం ముగింపుగా నేడు, శనివారం జరిగిన భారీ అన్నసమారాధన ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు.
