సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి … శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం సందర్బంగా సామూహిక వరలక్ష్మి వ్రతములు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించారు. 1000 మంది మహిళ భక్తులు ఈ వ్రతములో పాల్గొన్నారని మరియు వ్రతములో పాల్గొన్న మహిళ భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి వారు మెంటే వారి వంశస్తులు చీరలు బహుకరించారు మరియు పూజ కార్యక్రమం తదుపరి సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
