సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నారు. సాయి బాబా భక్తులకోసం ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణ షెడ్యూ ల్ ను ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఏటీఆర్ 72–600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరిమూడు గంటలకు షిర్డీ చేరుకుంటుంది. అలాగే షిర్డీ నుంచి మరో విమానం మధ్యా హ్నం 2.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుతుందని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కె ట్ ధర రూ.4,246గా, షిర్డీ నుంచి ఇక్కడికి రూ.4,639గా నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఒకరోజు పాటు ప్రయాణించే వారికి ఇకపై విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2న్నర గంటల్లోనే చేరుకోవచ్చు..
