సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం లో గోడకూలి 8 మంది మృతి చెందటం పలువురు గాయపడిన ఘటన లో మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ చంద్రబాబు సర్కార్ ఎక్స్గ్రేషియా (ex-gratia) ప్రకటించింది. ప్కపక్క మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే గాయపడిన వారికీ రూ.3 లక్షల చొప్పన పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది.
