సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల యజమానులకు కాస్త ఊరట లభించింది. వైట్ కాలర్ సినీ పెద్దల వల్ల కానిది ఆర్ నారాయణమూర్తి సాధించిపెట్టాడు.. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. థియేటర్ల ఓనర్లకు నెల రోజుల గడువు ఇచ్చిన సర్కార్… నెలరోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతితో 9 జిల్లాల్లో సీజ్ అయిన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి. మరి కొందరు లైసెన్స్ రెన్యూవల్ లేక స్వచ్చంధంగా మూసివేశారని తెలుస్తుంది. ఇందు కోసం జాయింట్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. థియేటర్ల వ్యవహారానికి సంబంధించి కేవలం రైతుల కోసం, బడుగు, శ్రామిక వర్గాల కోసం సినిమాలు తీసే నిస్వార్ధ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తితో కలిసి మంత్రి పేర్ని నానిని థియేటర్ల యజమానులు కలిసిన నేడు, గురువారం జరిపిన చర్చలుఫలించాయి .ఇటీవల ఏపీ వ్యాప్తంగా పలు థియేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. టికెట్లు రేట్లు , తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తుండటంతో పాటు సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే..
