సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో నేడు, బుధవారం సీఎం జగన్ అడ్జక్షతన ఏపీ క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశం నేడు, బుధవారం ఉదయం ప్రారంభమైంది. అసెంబ్లీ లో అనుసరించవలసిన విధానాలు ఫై చర్చతో పాటుగా.. ఎస్ఐపీబీ ఆమోదించిన భారీ ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ తన నిర్ణయం ప్రకటిస్తుంది.. విశాఖలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై కేబినెట్లో చర్చిస్తున్నారు. విద్యుత్ శాఖలో విండ్, సోలార్ ఎనర్జీ కేబినెట్ ఆమోదముద్ర కోసం ఎదురుచూస్తుంది. పలు సంక్షేమ పథకాల గైడ్ లైన్స్లో మంత్రివర్గం మార్పులు చేసే అవకాశం ఉంది అని భావిస్తున్నారు… అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి కి సంబంధించి కీలక నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపవలసి ఉంది.
