సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తో మాట్లాడిన తనకు రైతులు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై , జగన్ విజన్, అవగాహన తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ప్రఖ్యాత సంస్థ ఫ్లిప్కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తాజా వీడియో సందేశంలో, చెప్పారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. గత, గురువారం సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం బెంగళూరు చేరుకున్న కళ్యాణ్ కృష్ణమూర్తి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రైతులు, ఎంఎస్ఎంఈలకు సీఎం జగన్ అనేక అవకాశాలు కల్పిస్తున్నారని, వీటితో పాటు నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టి పెట్టడాన్ని ఆయన అభినందించారు. విశాఖలో అడుగుపెడుతున్. ఫ్లిప్కార్ట్ గ్రూపు సంస్థలైన ఫ్లిప్కార్ట్, ఫ్లిప్కార్ట్ హోల్సేల్, ఈకార్ట్, క్లియర్ ట్రిప్ సంస్థల విస్తరణ ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా భవిష్యత్లోనూ పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు.
