సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఫై పెట్టిన సిబిఐ కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ కేసులు వేరే రాష్ట్రము హైకోర్టు కు మార్చాలని పిటిషనర్ లు కోరుతున్నట్లు జగన్ కేసుల బదిలీకి నిరాకరించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేశారు. అలాగే జగన్ బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్పై కూడా ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ప్రకటించింది.
