సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం సమీపంలోని గొల్లల కోడేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ను ప్రారంభోత్సవం సందర్భముగా నేడు, గురువారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు హాజరయి కేక్ కోసి ఆ చర్చి సంఘస్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా చర్చిలో ప్రార్ధనలు అనంతరం సభనుద్దేశించి మాట్లాడుతూ .. సాటివారి పట్ల మానవత్వం ప్రేమతత్వం చూపించడమే దేవునికి ఇష్టమని .. దేవుడు చెప్పిన విదంగా అందరూ సన్మార్గంలో జీవించాలని, దేవుని సూచించిన మంచి మార్గంలో నడిచినవారికి ఆయన దీవెనలతో సర్వదా శుభం కలుగుతుందని పేర్కొన్నారు.
