సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చర్చలు విఫలం అయ్యాక యుద్ధ విరామం పాటించకుండా మరల యుద్దానికి ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ సిద్ధం అవుతున్నాయని వార్తలు రావడంతో భారత్ లో దేశీయ మార్కెట్లు నేడు, సోమవారం ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమ్యాయి(Stock Market ). దాంతో సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1566 పాయింట్లు పతనమై.. 75,983 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 464 పాయింట్లు నష్టపోయి, 23,586 వద్ద ఉగిసలాడుతుంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇక ఇటీవల డాలర్ తో పోలిస్తే కాస్త కోలుకున్నట్లు కనిపించిన రూపాయి.. ఈ పరిణామాలతో మరో 48పైసలు పడిపోయి,93.31గా ఉంది.
