సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గునుపూడి భీమవరం నందు వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్ధానం నందు శివరాత్రి కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు, ఆదివారం శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి రధోత్సవం లో వీక్షించడానికి ఆదివారం కూడా కావడంతో నేటి సాయంత్రం సుమారు 20వేల మంది భక్తుల మద్య మేళతాళాలు, యువత నృత్యాలు బాణాసంచా కాల్పుల మధ్య సుమారు పుష్ప , అరటి గెలల అలంకార భూషితమైన 40 అడుగుల భారీ రధం ను చిన్నారులసందడి మధ్య ,వందలాది భక్తులు లాగుతూ నేటి రాత్రి 7 గంటలకు నాచువారి సెంటర్ కు తీసుకొనివచ్చారు. అక్కడ ప్రసాద వితరణ జరిగింది. హరహర శంభో నామ స్మరణ మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో మహిళలు కూడా విశేషంగా పాల్గొన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను సమర్ధవంతంగా పర్యవేక్షించారుఇదే తీరున 25 అడుగుల స్థానిక భేమేశ్వర స్వామి దేవాలయ రధోత్సవమ్ కూడా ఘనంగా బాణాసంచా కాల్పుల మధ్య సందడిగా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *