సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు రెడ్డిశివశంకర్ రాధారాణి దంపతులు శ్రీ అమ్మవారికి కానుకగా 15గ్రాముల బంగారం ను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు. .వీరికి ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ప్రసాదాలు శేషవస్త్రం ఫోటో అందచేసినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు.
