సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి మంగళవారం ఉదయం బెంగుళూర్ నుండి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈసందర్భంగా జగన్ కు హెలిప్యాడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి జగన్ పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే వైయస్సార్ ఘాట్ కు పూలమాలవేసి నివాళులర్పించారు. జగన్ ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో పర్యటిస్తారు..పులివెందుల ప్రజలకు అందుబాటు లో ఉంటారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో కడప జిల్లాకు సంబంధించిన నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు.
