సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం దర్శించుకున్న హైదరాబాద్ కి చెందిన భక్తులు దండు దుర్గా ప్రకాష్ రాజు, శైలజా నాగ దుర్గా దంపతులు 504 గ్రాముల వెండి పళ్లెం శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు ఆసిర్వచనం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి శేషవస్త్రం ప్రసాదం అందించారు.
