సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానంలో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి .. శ్రీ అమ్మవారి భక్తులకు నిత్యా కళ్యాణం పచ్చతోరణం లా ఆధ్యాత్మిక కార్యక్రమాల జోరు పెరిగింది. భీమవరంలో సంతోషాలు, సంపద పెరిగి.. అందరూ బాగుండాలి అని, అందుకు శ్రీ మావూళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలనినేడు, ఆషాడ బహుళ పాడ్యమి ధాన్యలక్ష్మి పూజ బ్రహ్మ శ్రీమద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహిoచారు రైతులకు, భక్తులకు పూజలు చేసిన గుప్పెడు ధాన్యం, పసుపుకొమ్ము ఉచితంగా అందించారు . సదరు ధాన్యం గింజలు పొలాల్లో చల్లుకొని వ్యాపారులు భక్తులు అయితే, పసుపు కొమ్మును బీరువాలో పెట్టుకోవాలని ప్రధాన అర్చకులు, దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
