సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సాయంత్రం నుండి రాత్రి వరకు గుడివాడ లో టీడీపీ, వైసీపీ పార్టీల జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశాలు నేపథ్యంలో..క్యాడర్ మధ్య ఒకరి ఫై ఒకరు ఉద్రిక్తలు తలెత్తిన నేపథ్యంలో మాజీ మంత్రులు కోడలి నాని, పేర్ని నాని ని పోలీసులు గృహ నిర్బంధం చేసిన నేపథ్యంలో .. వైసీపీ సమావేశానికి వెళుతున్నకృష్ణ జిల్లా జడ్పీ టీసీ చైర్మెన్ ఉప్పల హారిక మరియు ఆమె భర్త కారులో ఉండగా పలువురు కారుపై రాళ్ళూ వేసి వారిని దుర్బలాడుతూ జరిపిన దాడిలో ఎట్టకేలకు బయట పడిన ఘటన.. బిసి నేతలు అయినా తమ కారుఫై టీడీపీ జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడిని స్థానిక పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. ఆ భార్యా భర్తలను గత రాత్రి వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించిన నేపథ్యంలో … నిన్న రాత్రి దాడికి గురైన కృష్ణా జిల్లా ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హారిక ని, ఆమె భర్త ను నేటి ఆదివారం ఉదయం పెడన లోని వారి గృహానికి వెళ్లి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పరామర్శించారు.
