సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి నేడు, బుధవారం స్థానిక భక్తులు వేగ్నేశ్న భరత్ కుమార్ వరలక్ష్మి, నాగ ప్రసన్న దంపతులు 8 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అందజేశారు. వారికీ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ బి నాగభూషణం అమ్మవారి ఫోటో ప్రసాదాలు అందించారు.
