సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్రంలో తాజాగా మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి ఏపీ పోలీసు నియామక మండలి (AP SLPRB) నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇక రాత పరీక్ష అక్టోబరు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పేపర్‌ 1 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ పేపర్‌ 2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ మేరకు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చును

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *