సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో గత 3 నెలల క్రితం వరకు 1కేజీ అల్లం మార్కెట్ లో 80 రూపాయలు ధరకు దొరికేది. ఉన్నటుండి 2 నెలల క్రితం ను గత వరం వరకు మార్కెట్లో అల్లం ధర 200 నుండి 250 కి పెరిగితేనే వినియోగదారులు నోర్లు వెళ్ళబెట్టారు. అయితే సప్లయ్ తగ్గడంతో గత 2 రోజులుగా అల్లం కు మరింత డిమాండ్ పెరిగిపోయి ప్రస్తుతం మార్కెట్లో కిలో అల్లం రూ.300 నుంచి రూ.350 వరకు ధర పలుకుతోంది. ఇది నిజంగా దేశంలో ఎక్కడ కనివిని ఎరుగని ధర.. దీంతో హోల్సేల్ వ్యాపారులు, రీటైల్లో పెద్దవ్యాపారస్థులు మాత్రమే అల్లం విక్రయాలు చేస్తున్నారు. రైతు బజారు సహా చిరువ్యాపారులు చాలామంది అల్లం అమ్మకాలు నిలిపివేశారు.1 కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 240 రూపాయలు ఉంటె.. దాని కన్నా అల్లం ధర ఇంతస్థాయిలో పెరిగిపోవడం తో మాంసాహారులకు అల్లం మాసాల తగ్గించక తప్పడం లేదు.
