సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఈనెల 22 & 23 తేదీల్లో “అప్లైడ్ సైన్సెస్ మరియు ఇంజినీరింగ్‌లో ఇటీవలి పురోగతి (ICRAAE-2023)” అనే అంశంపై మొదటి అంతర్జాతీయ (ఆన్‌లైన్) కాన్ఫరెన్స్ నిర్వహింపబడింది. నేడు, శనివారం జరిగిన .ఈ కాన్ఫరెన్స్ లో ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాసరావు , వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీనివాసరాజు , డీన్ (ఆర్ & డి), డాక్టర్ ఎ. రాజు, కాన్ఫరెన్స్ చైర్ డాక్టర్ పి.ఎస్. బ్రహ్మానందం , ఇతర డీన్స్, విభాగాధిపతులు మరియు భారతదేశం మరియు వివిధ ప్రపంచ దేశాల (తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, మొదలగు) నుండి అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ (AS&A), సీనియర్ IEEE సభ్యుడు డాక్టర్ M. కామరాజు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ప్రాంతంలో ఇటీవలి పరిణామాల గురించి మాట్లాడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు మరియు విదేశాల నుండి ఇక్కడకు వచ్చిన పరిశోధకులు 50కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *