సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్ జీ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉపాధి హామీ పథకం కింద ఏపీ వ్యాప్తంగా జూన్ నెలలో 14లక్షల నుంచి 20లక్షల మంది పనులు చేసినట్లు సమాచారం. అయితే, ఆ పథకం స్థానంలో వీబీజీ రామ్ జీ పథకం అమల్లోకి రావడంతో జూన్ నెలకు సంబంధించిన వేతనాలపై కొందరిలో ఆందోళ నెలకొంది. ఈ క్రమంలో వారికి ఈనెల 10వ తేదీ తరువాత ఆ నిధులు సంబంధిత కూలీల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుందని సమాచారం.
