సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేస్తున్న.. మాజీ సీఎం జగన్ అయితే తాము మరోసారి అధికారంలోకి వస్తే ప్రెవేటు పరం చేసిన మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని ఎవరు టెండర్లు కు రావద్దని హెచ్చరించిన అభ్యన్తరాల మధ్య సైతం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు టెండర్ నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం తాజగా విడుదల చేసింది. అయితే, ప్యూహాత్మకంగా అన్ని మెడికల్ కాలేజీలకు కాకుండా తొలి విడతలో భాగంగా కేవలం నాలుగు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు టెండర్ నోటిపికేషన్ ఇచ్చింది. ఆదోని, మార్కా పురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, మెడికల్ కాలేజీలు, 625 పథకాల సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల పీపీపీకి టెండర్లను పిలిచింది.
