సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కరోనా లక్షణాలకు దగ్గరగా ఇటీవల మరోసారి చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ దృష్ట్యా ప్రపంచం అలర్ట్ అయ్యిందని అందరికి తెలిసిందే.. అయితే ఈ వైరస్ పట్ల భారతదేశంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అసలే వైరస్ లు త్వరగా వ్యాపించే చలికాలం.. తాజా సమాచారం ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక చిన్నారి అస్వస్థతకు గురవగా.. పేరెంట్స్ ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్స్లో టెస్ట్ చేయగా బేబీకి హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) పాజిటివ్ అని తేలింది. అదే ఆస్పత్రిలో తాజాగా మరో ఇలాంటి కేసును కనుగొన్నారు. ఇంకో 3 నెలల పాప ఈ వైరస్ బారిన పడింది. దీని మీద సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం నేడు, సోమవారం ప్రకటించింది. అయితే తమ ల్యాబుల్లో దీన్నిపూర్తీ స్థాయిలో నిర్ధారించాల్సి ఉందని పేర్కొంది.
