సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. జగన్ పెద్దనాన్న వై యస్ ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి (40) ఇటీవల డెంగ్యూ జ్వరం వచ్చి ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో అభిషేక్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. గత ఎన్నికలలో కడప జిల్లాలో వైసీపీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించిన యువనేత అభిషేక్ రెడ్డి మృతిపై వైసీపీ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయారు. అభిషేక్‌రెడ్డి పార్థివదేహాన్ని పులివెందులకు తీసుకోని రావడంతో నేడు, శనివారం ఉదయం అభిషేక్‌రెడ్డి. అంత్యక్రియల్లోమాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి , వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు.పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, మరి కొందరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *