సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీపేట పదవ తరగతి విద్యార్థినుల మిస్సింగ్ ను పోలీసులు ఛేదించారు. అదృశ్యం అయిన కొండపల్లి శిరీష, గడ్డం రవళిక, వరలక్ష్మి లను పోలీసులు 20 గంటలు శ్రమించి పట్టుకున్నారు. గత గురువారం రోజున స్కూల్ కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి నిజామాబాద్ కు వెళ్లారు. స్కూల్ కు రాకపోయేసరికి పాఠశాల ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల వెతికి ఆచూకీ లేకపోవడంతో గత గురువారం రాత్రి 11 గం.లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నవీపేట్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు బృందాలుగా ఏర్పడి గాలించగా మొదట ఒక విద్యార్థిని నేటి శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటలకు నిజామాబాద్ బస్టాండ్ వద్ద దొరకగా మరో ఇద్దరినీ నేటి సాయంత్రం 6 గంటల సమయంలో పట్టుకున్నామని, ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు నవీపేట్ ఎస్సై కె.వినయ్ తెలిపారు. తల్లి తండ్రులు అదే రోజు రాత్రి పోలీస్ పిర్యాదు చెయ్యకుంటే వారి ఆచూకీ కష్టం అయ్యి తెలిసి తెలియని వయస్సులో వారి చేసిన తప్పుకు వారి భవిషత్తు అంధకారం అయ్యే ప్రమాదం ఉంది.
