సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉత్తరాంద్ర కు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్నపాత్రుడు తరపున మూడు సెట్ల నామినేషన్ లను నారాలోకేష్ , పవన్ కళ్యాణ్, సత్యకుమార్ల ప్రతిపాదించారు. నేటి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల గడువు ముగియడంతో అయ్యన్నపాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక అయ్యింది.
