సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా కందుకూరు లో జరిగిన ఘటనకు టీడీపీ నేతల మూర్కత్వమే కారణమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనపై నేడు, గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలకు తక్కువ స్థలం లో జనం ఎక్కువ మంది ఉన్నట్లు చూపించడానికి డ్రోన్ వీడియోలు తియ్యడానికి .. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. గతంలో సీఎం గా చంద్రబాబు ఇదే తీరు ప్రచార బాహాటం కోసం రాజమండ్రి పుష్కరాలలో 27 మందిని బలి చేసారని , అసలు చంద్రబాబు ఏం చేశారని జనం వస్తారని ప్రశ్నించారు. ఇరుకు సందులో బస్సు యాత్ర పెట్టారని, ఫెక్సీలు కట్టి మరికొంత రోడ్డు ఆవరించేశారని ఆరోపించారు. టీడీపీ ‘ఇదేం ఖర్మ .. తీరుతో 8 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం జగన్ సర్కర్ సిద్ధంగా ఉందని.. అసలు కందుకూరులో చంద్ర బాబు సభ పక్కనే ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆస్పత్రి లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *