సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినట్లుగా లోక్ సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారని భావిస్తున్న నేపథ్యంలో వాటితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రచారంలో ఉన్నట్లు మార్చిలో కాకుండా ఏప్రిల్ 2వ వారంలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటించి వెళ్లిన తర్వాత దీనికి సంబంధించి ఎన్నికల అధికారి లేఖ ఒకటి సర్క్యులేషన్లో ఉంది. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్గా ఈసీ పెట్టుకున్నట్లు ఆ లేఖలో ఉంది. ఈ మేరకు ఒకవేళ దీనికి ఈసీ ఆమోదించినట్లేయితే ..?నిర్ణయం ఫైనల్ అవుతుంది.
