సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం లోక్ సభలో దేశంలో జాబితా ప్రత్యే క సమగ్ర సవరణ ఫై కేంద్రం కొత్త చట్టం SIR ఫై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో నేడు ఈ అంశం పై చర్చ జరిగింది. ఈచర్చలో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..ఈసారి పేపర్ బ్యాలట్ పాత పద్దతిలో ఓటింగ్ జరిగితే సంతోషిస్తాం. ఈవీఎం లను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారు..అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు . అందుకే పేపర్ బ్యా లెట్ సిస్టంలో ఎన్ని కలు నిర్వ హించాలి. అని అయితే వెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలి. 20 నెలల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాతే సుమారు 51 లక్షల ఓట్లు అదనంగా రికార్డయ్యాయి. దీనిపై మేం ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు ఇప్పటి వరకు అసలు చర్యలు తీసుకోవడం లేదు, విజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో ఏవిఎం మిషన్లు కౌంటింగ్ సమయంలో 99 శాతం ,ఛార్జింగ్ లో ఎలా? ఉన్నాయి. అవి పోలింగ్ సమయంలో 60 శాతం మాత్రమే చార్జింగ్ ఉంది. ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదు. వెరిఫికేషన్ కోసం ఈవీఎంలు వీవీ ప్యా ట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారు, దర్యాప్తు ఫై ఈసీ అధికారులు మాకు సహకరించలేదు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే.. అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది. ఇదెలా సాధ్యం.ఇలా ఎన్నో జరిగాయి.అని మిదున్ రెడ్డి తన వాదనను వినిపించారు.
