సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు చదువుతున్నారు.వారు నలుగురు నేడు, గురువారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే అసలు కారణాలు తెలియరాలేదు. పూర్తీ వివరాలు పోలీస్ దర్యాప్తులో తెలుస్తోంది. ఆత్మహత్య ప్రయత్న విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అయితే బాలికల పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేరుకోవడంతో విషాద వాతావరణం నెలకొంది.
