సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారి 216పై నేటి శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సీతనపల్లి వద్ద హైవేపై మినీ లారీ, కం టైనర్ ఢీకొన్నా యి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృ తి చెందారు. ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మినీ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని భావిస్తున్నారు. లేదా మరో కారణమో కానీ జాతీయ రహదారిపై కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టాడు అని భావిస్తున్నారు. మృతులలో గండి ధర్మవర ప్రసాద్ (27), అమలాపురానికి చెందిన పేసింగు కనకరాజు (34), కాట్రేనికోనకు చెందిన చింతా లోవరాజు (32), మాగపు సోమరాజు (30), ఎస్ యానాంకు చెందిన రేవునాగభూషణం (26), తమిళనాడుకు చెం దిన కంటైనర్ డ్రైవర్ అయ్యప్పన్ (42)గా గుర్తించారు. జిల్లాలో ఈ ప్రమాదం పై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మత్స్య కారులు మృతి చెందడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకొక్క బాధిత కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *