సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫెస్టివల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పాల్గొన్నా రు. సుకుమార్ తేరకెక్కించిన పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరకుంది. భారత్ లో జాతీయ స్థాయి ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకునేలా చేసిన పుష్ప ఇప్పటికే ఎన్నో అవార్డులను, ప్రశంసలు అందుకున్నఈ సినిమా ఇప్పు డు ప్రతిష్టాత్మ క బెర్లిన్ ఫెస్టివల్లోనూ ప్రదర్శితమైయింది. ఈ చిత్రం ప్రదర్శ న అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్ తో అల్లుఅర్జున్ కొంత సేపు మాట్లాడారు. ఆ సందర్భముగా ప్రస్తుతం పుష్ప పార్టీ 2 షూటింగ్ పూర్తీ చేస్తున్నామని ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని.. తదుపరి ఈ క్రమంలో అన్ని అనుకూలిస్తే దర్శకుడు సుకుమార్ తో కల్సి పుష్ప పార్ట్ -3 కూడా చేసే ఉద్దేశ్యంలో ఉన్నామని పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలనిఅనుకుం టున్నట్లు అల్లుఅర్జున్ ప్రకటించారు. పుష్ప 2 సినిమాలో రష్మి కా మం దన్నా తో పాటు ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయలతో పాటు కీలక విలన్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.
