సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఫోన్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భారత్ తో అమెరికా మిత్రత్వం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్,తో సహా అందరు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ తో సహా అందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించారు. అనేక చోట్ల మతపరమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
