సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 60వ వార్షికోత్సవాలు వచ్చే జనవరి 13వ తేదీ నుండి ప్రారంభమౌతున్న నేపథ్యంలో శ్రీ అమ్మవారి మూలవిరాట్ కు రంగుల అలంకరణ కోసం ఈనెల 9 వ తేదీన గర్భ గుడి లో దర్శనం నిలుపుదల చేసిన నేపథ్యంలో .. నేడు, గురువారం నూతన దివ్య అలంకరణలతో శ్రీ మావుళ్ళమ్మవారి మూలవిరాట్ కు వేద పండితులతో కళన్యాసం పూజలు,యాగం నిర్వహించి నేటి ఉదయం 11న్నర గంటలకు భక్తులకు పునర్దర్శనం కల్పించారు.ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు, పివిఎల్ నరసింహరాజు మరియు ఆలయ సహాయ కమిషనర్, కార్య నిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేస్వరరావు మరియు ధర్మకర్తలు సభ్యులు , ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
