సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్‌తో మరి కొద్దీ రోజులలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ, ఇక ముందు తమకు నమ్మకమైన గొప్ప దేశాలతోనే ఒప్పందాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన సానుకూల వ్యాఖ్యలు దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock markets) కు కొత్త జోష్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీయడంతో పాటు, విదేశీ పెట్టుబడులు (Foreign investments) వెల్లువెత్తడంతో నేడు శుక్రవారం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 150.40 పాయింట్లు (0.18 శాతం) లాభపడి 83,906.27 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ (Nifty) 54.50 పాయింట్లు (0.21 శాతం) పెరిగి 25,603 వద్ద కొనసాగుతోంది. డాలర్ వద్ద మన ఇండియా రూపాయి మరో 20 పైసలు బలపడి 85. 50 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *