సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా భీమవరం జనసేన పార్టీ ఆఫీస్ నందు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గ ఇంఛార్జి గోవిందరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాతగా, బడుగు, బలహీనవర్గాల వారికి భారత సమాజంలో సముచిత స్థానం కోసం అంబేద్కర్ చేసిన కృషి ని, పోరాటాన్ని మన జనసేన ఆదర్శంగా తీసుకోని,పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కు కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం పట్టణ,భీమవరం మండలం ,వీరవాసరం మండలం నాయకులు,MPTC లు, జనసైనికులు, వీర మహిళలు.మరియు రాష్ట్ర నాయకులు మల్లినిడి తిరుమల రావు, బండి రమేష్ కుమార్,భీమవరం పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్, ,భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, పట్టణ సెక్రటరీ సుంకర రవి, మండల సెక్రటరీ కత్తుల నీలేంద్ర,భీమవరం మండల Mptc లు గుల్లిపల్లి విజయలక్ష్మీ , తాతపూడి రాంబాబు, అరేటి వాసు, మాజీ కౌన్సిలర్ మాగపూ ప్రసాద్ , లక్కోజు నాని ,RSR,హరి వర్థన్, కట్రెడ్డి రాము,అప్పారావు, పద్మారావు, గుండా బాబు, మోపిదేవి జగన్, రామ్ ప్రసాద్, గాస్ శ్రీను, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *