సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భీమవరం మండలంలోని 2వ యనమదుర్రు క్యాంపస్లో నేటి బుధవారం జాతీయ కాంక్రీట్ కానో పోటీలు (ఎన్సిసిసి) – వైబోరాక్ నిర్వహించారు. మధ్యాహ్నం నుండి, పోటీ ప్రారంభమైంది, ఇందులో 8 నుండి 10 జట్లు పాల్గొన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 16 విద్యాసంస్థల విద్యార్థినులు పాల్గొని పోటీలను తిలకించారు.ఈ పోటీలో విష్ణు సివిల్ ఇంజినీరింగ్ మహిళా విద్యార్థినులు ఆధునిక తరహాలో కాంక్రీట్ , పాలిమర్స్ మిక్స్ డిజైన్ లో ఇంజినీరింగ్ సూత్రాల ను జోడించి వారే స్వయంగా నిబంధనలకు అనుగుణంగా తయారు చేసుకొన్నా తేలికయిన ప్రతిష్ఠమైన పడవలలో పోటీలలో పాల్గొని విజేతలు కావడం గమనార్హం. పడవ తయారీ విధానంపై వ్రాతపూర్వక నివేదికను కూడా సిద్ధం చేస్తారు, విజేతలు కు లక్ష రూపాయలు ప్రైజ్ మని అందించడం విశేషము. ఈ కార్యక్రమానికి వీర బిరాదార్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ట్రాన్స్హైట్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణురాజు ముఖ్య పోషకులుగా వ్యవహరించారు.వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్, సెక్రటరీ కె. ఆదిత్య విస్సామ్ పోషకులుగా ఉన్నారు. సహ పోషకులుగా ప్రిన్సిపాల్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, భీమవరం శ్రీ విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పాల్గొన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పాల గిరీష్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరించారు.
