సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన తాజా ప్రకటనలో.. భీమవరం పురపాలక సంఘం నకు చెల్లించవలసిన ఆస్తిపన్ను, ఖాళీస్థలం పన్నులు ఈ మార్చి నెలాఖురు లోపు చెల్లించినట్లయితే వడ్డీ మాఫీ సదుపాయం కలదు. అయితే మీరు చెల్లించాల్సిన పన్నులు యందు పాత బకాయిలు కూడా ఉన్నట్లయితే ఒకే మొత్తంగా చెల్లిస్తేనే వడ్డీ మాఫీ జరుగుతుందని విడి మొత్తాల్లో చెల్లించినట్లయితే వడ్డీ మాఫీ సదుపాయం కోల్పోవలసివస్తుంది. పన్ను చెల్లింపులకు వార్డు సచివాలయాలు లో మరియు పురపాలక సంఘ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసియున్నాము.
కాబట్టి భీమవరం పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *