సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ పరిధిలో గల పలు వార్డులను RDMA రాజమహేంద్రవరం NV సత్యనారాయణ తనిఖీ చేశారు, పారిశుద్ధ్య కార్మికులు స్ట్రైక్ లో ఉన్న కారణంగా వార్డులలో శానిటేషన్ యధావిధిగా జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.పలు హోటల్స్ వారు , ఇతర వ్యాపార సంస్థల వారు ముఖ్యమైన కూడళ్లలో చెత్త వేసిన నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి అపరాధసం విధించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ల కి మరియు శానిటేషన్ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేశారు…కూడళ్లలో లైట్స్ లేకపోయినా, అసలు లేకపోయిన వాటిని ఏర్పాటు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
