సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం భీమవరం పట్టణ స్థానిక 34 వార్డు నందు పరిశుద్యత, అక్రమ్ కట్టడాలు ను మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రా రెడ్డి తనిఖీ చేశారు ఈ తనిఖీలలో భాగంగా వార్డు సచివాల సిబ్బందితో మాట్లాడుతూ .. వార్డులలో గల చెత్తను ఇంటింటికి గవర్నమెంట్ వారు అందజేసిన డస్ట్ బిన్స్ ద్వారా తడి చెత్త పొడి చెత్త విడిగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీలలో సిల్టును తొలగించేలా చూడాలని సానిటరీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ వార్డు పరిధిలో అనధికార కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేసేలాగా టౌన్ ప్లానింగ్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు అదేవిధంగా స్థానిక ASR నగర్ పార్కును డెవలప్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు .. కమిషనర్ తో పాటు ఈ తనిఖీ లో సానిటరీ ఇన్స్పెక్టర్, ఏఈలు మరియు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *