సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. తమ సమస్యలన్నీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. మాకు తప్పకుండా న్యాయం చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.మా ఇష్యూస్ ను కేంద్రం వద్దకి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ కల్యాణ్ చెప్పారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసిన త్యాగాలను తాను మరచిపోనని పరిశ్రమను ప్రవేటీకరణ కాకుండా కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలన్నారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. 32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాల భూసేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ అని అవసరమైతే కార్మిక పోరాటానికి తాను అండగా ఉంటానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *