సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేడు, సోమవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి తరలివెళ్లిన రాష్ట్ర మంత్రులు అక్కడ పర్యటించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బం గా విభజన హామీలు, విశాఖ స్టీల్స్ ప్లాంట్ విషయమై కేంద్రాన్ని ప్రశ్నించాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి అని డిమాండ్ చేసారు. ఇక రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బం ది పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పని లేక వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇసుక కొరత 26 రంగాలకు చెందిన కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో టన్నుకు 370 సీనరేజ్ చార్జీ ఉండేది. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో వైజాగ్ లో సీనరేజ్ చార్జితో కలపి 10 టన్నుల ఇసుక 10 వేలకు దొరికేది. వైజాగ్ లో అయితే ఇసుక 14 నుంచి 15 వేలకు దొరికేది.ఇప్పుడు కూటమి పాలనలో 21 వేయి నుంచి 22వేలకు దొరుకుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇసుక అన్న తరువాత ఇంత భారీ రేట్లు వసూళ్లు చెయ్యడం దేనికి? ప్రజలకు నిత్యావసర వస్తువులు భారీ ధరలకు అమ్ముతున్నారు. ఈ ధరలు నియంత్రించలేరా? ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. విశాఖలో వేల కోట్ల రూపాయలు విలువైన 25వేల కేజీల డ్రగ్స్ సంధ్యా ఆక్వా కు గతంలో వచ్చాయి. అవి బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి బంధువులకు సంబంధించినది అనే ప్రచారం జరిగింది. మరి ఈ డ్రగ్స్ కేసు ఏమైందో తెలియదు. త్వరలో జరిగే శాసనమండలి సమావేశాలో దీనిపై ప్రస్తావిస్తాను’ అంటూకామెంట్స్ చేసారు బొత్య
